మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.

0
2

మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య ప్రారంభించారు. హెచ్ఐవి బాధితులపై వివక్ష చూపరాదని, వారికి భరోసా కల్పించాలని ఆయన సూచించారు. ఏఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడితే జీవితకాలాన్ని పెంచుకోవచ్చన్నారు. అనంతరం హెచ్ఐవి కారణంగా మృతి చెందిన వారిని స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.