మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..!
భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కాగా 2012లో ఇదే మండల తహశీల్దార్ ఆకుల సమ్మయ్య, 2016లో ఎంపీడీవో తాళ్ల ఉపేందర్, ప్రస్తుత ఎంపీడీవో రాధిక ACBకి పట్టుబడటంతో నర్సింహులపేట (M) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు ఇలా లంచాలకు ఆశపడటం సిగ్గుచేటని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము…










