“వైద్య నిర్లక్ష్యమా?.. ప్రభావతి మృతి కలకలం.|

0
0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్‌లోని ఎక్సెల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రభావతి (50) మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను కొద్ది రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స కొనసాగుతున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు బంధువులు తెలిపారు.

పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభావతిని మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అంబులెన్స్‌లో తరలిస్తుండగానే ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సరైన సమయంలో తగిన చికిత్స అందించకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపించారు.

ప్రభావతి మృతితో ఆవేదనకు గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్సెల్ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చికిత్సకు సంబంధించిన పూర్తి వివరాలు, వైద్య రికార్డులను అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరారు.

మరోవైపు ఆస్పత్రి వర్గాలు మాత్రం రోగి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అవసరమైన వైద్య సేవలు అందించామని పేర్కొన్నట్లు తెలిసింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

కుటుంబ సభ్యుల వాదనలు, ఆస్పత్రి యాజమాన్యం వివరణలను నమోదు చేసుకుని ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రభావతి మృతికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

#Sidhumaroju

Alwal