మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం బొమ్మనచెరువు వైద్య బృందం హెచ్ఐవీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించింది. మెడికల్ ఆఫీసర్ డా. మహమ్మద్ ఫర్ఖాన్, సీహెచ్వో శ్రావణి, ఏఎన్ఎం కనకమ్మ, ఆశా వర్కర్లు పాల్గొని 123 మందికి హెచ్ఐవీ పరీక్షలు చేశారు. హెచ్ఐవీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుందని, రక్త మార్పిడి ముందు పరీక్షలు, సురక్షిత సూదుల వినియోగం, గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి అని డా. ఫర్ఖాన్ సూచించారు. ఏఆర్టీ మందులతో బాధితులు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు.










