శుక్రవారం మదనపల్లి నియోజకవర్గం నారమాకులతాండాకు చెందిన రైతు చిన్న బుడ్డానాయక్ (38) గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. ఇది ప్రమాదం కాదని, తమ బంధువును కావాలనే హత్య చేశారని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.








