నకిలీ బంగారం పేరుతో మోసం.. ఏడుగురు అరెస్ట్.|

0
3

జేసీబీ పనుల్లో బంగారం దొరికిందని, తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను మదనపల్లి రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, కత్తులతో బెదిరించి నగదును కాజేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల నుంచి 2.8 కిలోల బంగారు పూసల దండ, నకిలీ బంగారు ఆభరణాలు, ఒక టయోటా కారు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ మోసం బయటపడిందని డీఎస్పీ పావని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.