యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం|

0
1

SPSR నెల్లూరు జిల్లా

 

జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి వైయస్ఆర్ మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు..యూరియా కొరతతో రైతాంగం పడుతున్న ఇబ్బందులపై వినతిపత్రం సమర్పణ

 

వ్యవసాయ శాఖ అధికారిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

 

కాకాణి మాట్లాడుతూ..

 

ఎడగారు పంటకు యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది అని వివరణ. ఆన్ లైన్ విధానంలో యూరియా పంపిణీతో రైతులు విసిగిపోయారు అని మండిపాటు. వరి నాట్లు పూర్తయ్యాయి కానీ యూరియా కొరత తీరలేదు, చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల ఎందుకు అమానుషంగా వ్యవహరిస్తుంది? ఎందుకు కక్ష సాధింపులకు పాల్పడుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అనుకూల నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోలేదు, మొదటి పంట సమయంలోనే నెల్లూరు జిల్లాకు సంబంధించి యూరియా కొనుగోలుకు కార్డులు ఇచ్చారు. ఎకరానికి మూడు బస్తాలు మాత్రమే ఇస్తామని, అంతకన్నా ఎక్కువ వాడడానికి వీల్లేదని రైతులపై పరిమితులు విధించారు. యూరియా బస్తాలను టీడీపీ నాయకులు బలవంతంగా తరలించుకుపోయి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారు.