విజయవాడ కృష్ణ లంకకు చెందిన గాదె సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులతో సహా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడును నేడు కలిశారు. తన కుమారుడి అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఆమె సీఎంను కోరారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు ధైర్యం చెప్పి, ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంపై విజయలక్ష్మి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారని గాదె విజయలక్ష్మి తెలిపారు.










