మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ పాల్గొన్నారు. మనిషి జీవితంలో ప్రతి దశలోనూ రెవెన్యూ శాఖ కీలక పాత్ర పోషిస్తుందని, రెవెన్యూ ఉద్యోగులు పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి, ప్రభుత్వంపై వారి నమ్మకాన్ని పెంచాలని ఆయన సూచించారు.










