పుంగనూరు పట్టణానికి రెండవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు మంజూరు కావడంతో, జిల్లా న్యాయమూర్తిని బుధవారం పుంగనూరు న్యాయవాదుల సంఘం తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్. వీరమోహన్ రెడ్డి, శివప్ప నాయుడు, బాలాజీ కుమార్, అధ్యక్షుడు విశ్వనాథ రెడ్డి, కార్యదర్శి అరవింద్ కుమార్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కోర్టును పుంగనూరు కోర్టు సముదాయంలో ఏర్పాటు చేయాలని కోరగా, జిల్లా న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు# కొత్తూరు మురళి.










