“చీరల సందడి మొదలు”|

0
0

“ఇంద్రానగర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే శ్రీకారం.”

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆల్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంద్రానగర్‌లోని మహిళా భవన్ వద్ద ప్రారంభించారు.

ఈ సందర్భంగా అర్హులైన మహిళలకు చీరలను పంపిణీ చేసి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తోందని తెలిపారు.

ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పండుగల సందర్భంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డీసీ, ఎంఎంసీ ఉద్యోగులు, మాజీ కార్పొరేటర్లు సబితా అనిల్ కిషోర్, విజయశాంతి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal