“గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి వైద్య పరీక్షలు”
మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బుధవారం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ జోన్-1 డీసీపీ కనకాల రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ పి. సుబ్బయ్య పర్యవేక్షణలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించారు.
ఈ ఆరోగ్య శిబిరంలో మొత్తం 127 మంది పోలీసు సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేత్ర పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిల పరీక్షలు, ఈసీజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించి వైద్య నిపుణులు అవసరమైన సూచనలు అందించారు.
శిబిరం నిర్వహణలో రెటినోవా ఫౌండేషన్ నేత్ర వైద్య సేవలు, శ్రీకర ఆసుపత్రి సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్కై ఫిట్ ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ సేవలు, పద్మ సాయి డెంటల్ దంత వైద్య సేవలు అందించి సహకరించాయి.
గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం. రవికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేశారు. పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి కమిషనరేట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు తెలిపారు.
#Sidhumaroju
Alwal










