“పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం”
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13: షాబాద్లో సంచలనం సృష్టించిన పోక్సో, ఆరు హత్యల కేసు ప్రధాన నిందితుడు రాజ్కుమార్ మృతి చెందాడు.
ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తూరు మండలం పంజర్ల గ్రామ సమీపంలోని ఓ వెంచర్లో సోమవారం అతని మృతదేహం లభ్యమైంది.
మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం సమీపంలో పాయిజన్ బాటిల్ లభ్యమవడంతో, ప్రాథమికంగా విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రాజ్కుమార్ మేనమామ స్వగ్రామం పంజర్లగా స్థానికులు చెబుతున్నారు. ఈ కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
#Sidhumaroju










