“కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం”.|

0
16

● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా.

● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు.

● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ.

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు ఈ ధర్నా చేపట్టాయి.

ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. వివాదాస్పద సీజెపీ సంస్థకు కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా మద్దతు ఇస్తోందని ఆరోపించారు.

విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే వందేమాతరం బిల్లులను పార్లమెంట్‌లో అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాల పాత్ర నిర్మాణాత్మకంగా ఉండాలని, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని బీజేపీ నేతలు సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ.. దేశ భద్రత, జాతీయ సమగ్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.

#Sidhumaroju

Alwal