మాట నిలబెట్టుకున్న పవన్.. మారుతున్న పిఠాపురం రూపురేఖలు|

0
2

ఏపీ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తన నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లె నుంచి పట్టణం వరకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఏకంగా రూ.200 కోట్ల అంచనా వ్యయంతో రహదారుల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

 

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల మేర 611 రోడ్ల నిర్మాణం పూర్తి కాగా, మరో 70 రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది. ఈ పనులతో గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజల ప్రయాణ కష్టాలు తొలగిపోయి రోడ్లన్నీ కళకళలాడుతున్నాయి.