● భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం
● భక్తుల ఆనందోత్సాహాల మధ్య గణనాథులకు ఘన వీడ్కోలు
● స్వాగత ఉపన్యాసం చేసిన డీసీ జోగేశ్వర్లు
● కార్యక్రమానికి హాజరైన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్
● క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్హెచ్ఓ ప్రశాంత్
● హైడ్రా టీం కూడా నిమజ్జన ఏర్పాట్లలో భాగస్వామ్యం
● రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో జాగ్రత్తలు
అల్వాల్, సెప్టెంబర్ 20: వినాయక నవరాత్రులలో భాగంగా మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్ కొత్తచెరువు బేబీ పాండ్లో గణేష్ నిమజ్జనాలు భక్తుల ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.
భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను తీసుకొచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీసీ జోగేశ్వర్లు స్వాగత ఉపన్యాసం చేశారు. మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కార్యక్రమానికి హాజరై నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం చేస్తూ కార్యక్రమం సజావుగా జరిగేలా పర్యవేక్షించారు.
క్షేత్రస్థాయిలో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ప్రత్యేక శ్రద్ధ చూపారు.
తన సిబ్బందితో కలిసి నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, భక్తుల రాకపోకలు, గణనాథుల నిమజ్జన ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బందిని సమన్వయం చేశారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించారు.
నిమజ్జన ఏర్పాట్లలో హైడ్రా టీం కూడా పాల్గొంది. రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది సమన్వయంతో పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
నిమజ్జన వేడుకల సందర్భంగా భక్తులు “గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్కి..” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధల మధ్య గణనాథులకు ఘనంగా వీడ్కోలు పలికారు.
#Sidhumaroju
Alwal








