ఈ సందర్భంగా ప్రెస్ మీట్ను ఉద్దేశించి ఆదోని DSF డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ శేఖర్ మాట్లాడుతూ,విద్యార్థి సమస్యలు బయటికి రాకుండా హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాల నాయకులను నిషేధించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడింది. హాస్టల్స్లో విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఎదురైతే విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడుతారని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాల నాయకులను నిషేధించడం ద్వారా విద్యార్థుల సమస్యలను బయటికి రాకుండా అడ్డుకోవడం సరికాదని అన్నారు.విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించే హక్కును హరించే విధంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని DSF విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాము.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టల్స్లోకి విద్యార్థి సంఘాల నాయకుల నిషేధాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని, డిమాండ్ చేస్తున్నాము. లేనిపక్షంలో విద్యార్థుల సమస్యల కోసం DSF ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము.ఈ కార్యక్రమంలో హరి, విక్రమ్, రమణ, వినోద్, రవి తదితరులు పాల్గొన్నారు.










