Madanapalle: కర్ణాటకలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లెకు చెందిన యువకుడు కంచర్ల మధు మృతి చెందాడు. మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు కుమారుడైన మధు మృతి చెందినట్లు చింతామణి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కర్ణాటకకు బయలుదేరి వెళ్లారు.










