● అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన, సమన్వయంపై పరిశీలన
● మింట్ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష
● కీలక ప్రభుత్వ సంస్థల భద్రతపై నిరంతర అప్రమత్తత
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 18: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చెర్లపల్లిలో ఉన్న ఇండియా గవర్నమెంట్ మింట్లో మంగళవారం ఉదయం భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు.
మాక్ డ్రిల్లో భాగంగా మింట్ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.
కీలక భద్రతా అంశాలను సమీక్షిస్తూ, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పోలీసుల అప్రమత్తత, పరస్పర సమన్వయం, తక్షణ స్పందన సామర్థ్యాన్ని పరీక్షించారు.
ఈ విన్యాసంలో భద్రతా విధుల్లో చేపట్టాల్సిన చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం, తక్షణ స్పందన వంటి అంశాలను పరిశీలించారు. కీలక ప్రభుత్వ సంస్థల భద్రత విషయంలో మల్కాజిగిరి పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని అధికారులు తెలిపారు.
#Sidhumaroju
Alwal










