చీరాల:
N.R. & P.M. హైస్కూల్ గ్రౌండ్లో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ మహిళా సభ్యురాలు శ్రీమతి ఇస్తర్ల సుభాషిణి అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, ప్రేమకు ప్రతీకగా వాకింగ్ సభ్యులందరికీ రక్షాబంధన్ కట్టి, స్వీట్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సుభాషిణిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శాలువాతో సత్కరించి, నూతన వస్త్రాలను బహుకరించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలను చాటే రాఖీ పండుగను వాకర్స్ సభ్యులు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
కార్యక్రమంలో చారగుళ్ల గురుప్రసాద్, డేగల తిరుపతిరావు, నారాయణమూర్తి, వీరాంజనేయులు, డి. సుబ్బారావు, కాటమరాజు, మోహనరావు, స్వామితుకారాం, శివాంజనేయ ప్రసాద్, రమణారావు తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.










