రాఖీ రద్దీ… నల్లబెల్లిలో బస్సులు కిటకిట…

0
1

భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా మండల కేంద్రంలో బస్సుల కోసం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది.

ఉదయం నుంచే వరంగల్, నర్సంపేట, పరిసర గ్రామాలకు వెళ్లే బస్టాప్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లో ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు సూచించారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము