Madanapalle: అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం. స్పాట్‌లోనే శాస్త్రీయ ఆధారాలు సేకరించేలా వాహనాన్ని ప్రారంభించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లి.

0
0

మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్‌చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్‌కు అప్పగించారు. నేరస్థలంలో ఆధారాలను గుర్తించి, శాస్త్రీయంగా సేకరించేందుకు ఈ వాహనంలో హై-ఇంటెన్సిటీ లైట్లు, డీఎన్‌ఏ తదితర 10 రకాల అత్యాధునిక కిట్లు, మైక్రోస్కోప్ వంటి పరికరాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.