సికింద్రాబాద్ : వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ వెల్లడించారు.
వెస్ట్ మారేడుపల్లిలోని లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి సమీపంలో నివసించే మొహమ్మద్ అలీ ఖాన్ మనవడు ఆసిఖ్ (16) ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా తన లగేజీతో సహా బయటకు వెళ్ళిపోయాడు.
తల్లిదండ్రులు మరణించడంతో ఆసిక్ తన తాత మొహమ్మద్ అలీ ఖాన్ సంరక్షణలో ఉంటున్నాడు.
22వ తేదీ తెల్లవారుజామున బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడి తాత ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 106/2026 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్.హెచ్.ఓ. నోముల వెంకటేష్ తెలిపారు.
ప్రస్తుతం ఏఎస్ఐ లింగయ్య ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
అదృశ్యమైన బాలుడు 5.5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు టీ-షర్ట్ మరియు ట్రౌజర్ ధరించి ఉన్నాడు.
తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగల ఈ బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా 9885700365 నంబర్కు సమాచారం అందించాలని ఎస్.హెచ్.ఓ. విజ్ఞప్తి చేశారు.
#sidhumaroju










