మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న ఒక ముఠా ఉదంతం కలకలం రేపింది.
ఉప్పల్ అసిస్టెంట్ సివిల్ సప్లై కార్యాలయ నాయబ్ తహసీల్దార్ గంగిరెడ్డి ప్రదీప్ కుమార్ నేతృత్వంలో, ఆల్వాల్ ఎస్ హెచ్ ఓ సూచనలతో హస్మత్పేట అంజయ్య నగర్ వద్ద పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో భాగంగా అటుగా వెళ్తున్న TS34TA8006 నంబర్ గల బొలేరో వాహనాన్ని నిలిపి సోదా చేయగా, అందులో భారీగా గృహ అవసరాలకు వాడే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యాయి.
వాహనంలో ఉన్న మొత్తం 69 ఇండియన్ గ్యాస్ సిలిండర్లలో 14 నిండుగా ఉండగా, మిగిలిన 55 ఖాళీ సిలిండర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ సంఘటనపై ఎస్సై తరుణ్ రెడ్డి మాట్లాడుతూ… పట్టుబడిన స్టాక్కు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేవని, వీటిని నల్లబజారులో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు తమ విచారణలో నిర్ధారణ అయ్యిందని తెలిపారు.
సామాన్య ప్రజలకు సబ్సిడీపై అందాల్సిన గ్యాస్ సిలిండర్లను ఇలా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న రాజస్థాన్కు చెందిన అనిల్ సావన్ మరియు అనిల్ కిలేర్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సిలిండర్లను అల్వాల్లోని హిందుస్థాన్ గ్యాస్ కంపెనీకి తరలించి, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
#sidhumaroju
Alwal










