ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది

0
5

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు

ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ప్రచారాలు నిర్వహించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తమ విద్యా సంస్థల యొక్క ర్యాంకుల ప్రచారాలు నిర్వహిస్తూ పట్టణంలో పెద్దపెద్ద ఫ్లెక్సీలు, బోర్డింగ్ బోర్డులు పెట్టి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అడ్మిషన్ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు కొన్ని విద్యా సంస్థలు అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకున్నా ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారు మరోవైపు పట్టణంలో పెద్ద పెద్ద ప్రచార బోర్డులు పెట్టి, ప్రధాన కూడలిలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ప్రచారాలు నిర్వహిస్తూ వీఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వా నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేస్తున్నప్పటికీ పట్టణంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు నిదర్శనం అన్నారు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్లకిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు , ఇప్పటికైనా ప్రభుత్వ నియామ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఫ్లెక్సీలను తొలగిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నహీమ్అహ్మద్ గారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫ్లెక్సీలను రెండు రోజుల లోపల తొలగిస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది.

అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.