పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్టపై హాజరత్ నూరుషావలి బాబా ఉరుసు ఉత్సవాలు ఈ నెల 8, 9, 10 తేదీల్లో దర్గా కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, సోమవారం సీఐ సుబ్బరాయుడు నిర్వాహకులతో కలిసి భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉరుసు కమిటీ సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.










