డీఎస్‌బీసీయూ చైర్మన్ మణికంఠకు ఎమ్మెల్యే కొండయ్య సన్మానం|

0
1

చీరాల

ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్ 32 (7) (a)(i) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. కమిటీ చైర్మన్ గా కడియం మణికంఠ (కారంచేడు), సభ్యులుగా వై. పద్మావతి (కొణిజేడు, టంగుటూరు మండలం), కె. వెంకట కొండయ్య (వెంకటాయచెరువు, సీఎస్ పురం మండలం) కొ నసాగనున్నారు. ఈ సందర్భంగాత్రీమెన్ కమిటీ చైర్మన్ గా నియమితులైన కడియం మణికంఠ, సభ్యులకు ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య శుభాకాంక్షలు తెలిపారు. గొర్రెల పెంపకందారుల సంక్షేమం, అభ్యున్నతికి కమిటీ కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షిం చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కొండయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.