🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందించిన. మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు స్వయంగా మంత్రి గారిని కలిసి రైతుల బాధలను వారి దృష్టికి తీసుకెళ్లారు.కెరమేరి మండలం సుర్దాపూర్, జైనూర్ మండలం పొలస, సిర్పూర్ (యు) మండలం మరియు లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామాల పరిధిలోని పోడు రైతులు అనేక సంవత్సరాలుగా ఆ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములే వారి కుటుంబాలకు ఏకైక జీవనాధారమని వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు స్పందిస్తు. వెంటనే జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ గారు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు ముసాదే చరణ్ గారు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










