నాగేటిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ
శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నకోతపల్లి మండలం నాగేటిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో గుడిలోకి ప్రవేశించిన దొంగలు.. స్వామివారి విగ్రహానికి అలంకరించిన విలువైన వెండి కవచం, వెండి పాదాలు మరియు బంగారు కన్నును అపహరించుకుపోయారు. ఉదయం గుడికి చేరుకున్న ఆలయ నిర్వాహకులు ఈ దొంగతనాన్ని గుర్తించారు.
పవిత్రమైన గుడిలో చోరీ జరగడం పట్ల గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే 6301794923 లేదా 8688231291 నంబర్లకు సమాచారం అందించి సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.









