నందిగామలో అవినీతి అక్రమాలపై వైసీపీ ఆగ్రహం|

0
2

నందిగామలో అవినీతి, అక్రమాలపై వైసీపీ ఆగ్రహం

టీడీపీ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శలు

నందిగామ, జూలై 6 భారత్ అవాజ్ :

నందిగామలో టీడీపీ నాయకులు అవినీతి, దోపిడీలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డా. మొండితోక జగన్‌మోహన్‌రావు ఆరోపించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎంపీడీవోను డబ్బులు డిమాండ్ చేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించినందుకు వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం అన్యాయమని, తప్పు జరిగితే సంబంధిత వారిపైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అక్రమ ఇసుక, గ్రావెల్, మైనింగ్, రేషన్ బియ్యం దందాలు, మున్సిపాలిటీ, పంచాయతీల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. నందిగామ అభివృద్ధిని పక్కనపెట్టి అవినీతికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దుకూరి సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.