దేవాదుల ప్రాజెక్టు భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలి

0
1

కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి

హనుమకొండ, జూలై 8:జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూసేకరణ పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బుధవారం న్యూఢిల్లీ నుంచి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొని, భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయి, జిల్లాలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న సుమారు 42.34 ఎకరాల భూమి సేకరణకు వేగవంతమైన చర్యలు చేపట్టామని, సంబంధిత రైతులతో సమన్వయం చేస్తూ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, పర్యవేక్షకులు జగత్ సింగ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.