అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి రూ. 3 లక్షల విరాళం మంగళవారం అందించారు. స్థానిక ఎంపీటీసీ గీతా రామిరెడ్డి ద్వారా ఈ చెక్కును హెచ్ఎం సిద్ధారెడ్డికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. దాతకు, సహకరించిన మనోహర్, రామకృష్ణలకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










