మదనపల్లెలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.|

0
0

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆదేశాల మేరకు, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి సహాయకులకు, ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు.