వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి
భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సామల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. 2 నెలల క్రితం రఘునాథపల్లి పోలీస్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన బుధవారం విధుల్లో ఉండగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. శ్రీనివాస్ స్వస్థలం గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము









