ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కుని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటును కాపాడుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. ‘SIR’ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలు ధ్రువీకరణ సరిగా జరిగేలా చూడాలని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.










