మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన వారిలో మాజీ కార్పొరేటర్లు సబితా కిషోర్, విజయశాంతి, జగదీష్ గౌడ్లతో పాటు బద్దం పరశురామ్, అనిల్ కిషోర్ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా నేతలు ఎమ్మెల్యే దంపతులకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సందడి చేశారు.
#sidhumaroju
Alwal










