మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా *దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి* మాట్లాడుతూ… మున్సిపాలిటీ నందు పనిచేస్తున్న కార్మికులకు క్యాటగిర్లవారీగా వేతనాలు చెల్లించాలన్నారు.
ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన మున్సిపల్ కార్మికులకు డబ్బులు చెల్లించాలన్నారు. అదే విదంగా పండగలకు సెలవు ఇవ్వాలని,60 సం,,లు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులందరికి ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. ఈ సంవత్సరాన్ని పరిష్కారం కొరకు ఈనెల 28న ఈ హైదరాబాద్ సిడిఎంఏ కార్యాలయం ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాసర్ల రాజలింగు మున్సిపల్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి, మున్సిపల్ యూనియన్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు , మున్సిపాలిటీ కార్మికులు దేవవరం,ఎల్లయ్య
రాజు రవి నారాయన రమేష్తి,రుపతి పోశం విష్ణు గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు.










