వివాహిత అనుమానాస్పద మృతి

0
5

భారత్ ఆవాజ్

సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్

వివాహిత అనుమానాస్పద మృతి
నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుండి తరలించడానికి వీల్లేదంటూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.పోలీసులను అడ్డుకుంటూ ఘటన స్థలంలోనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.