పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, జిఎస్ఆర్.పురం పెట్రోల్ బంకులను మంగళవారం తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేయకుండా వాహనదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి బంకులను సీజ్ చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
#Boiena Rajesh








