చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై పంటల రవాణాకు డీజిల్ దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, మంగళవారం రైతుల బృందం ఐటీడీఏ పీఓ (PO) శుభం నోక్వాల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతుల విజ్ఞప్తిని సావధానంగా విన్న పీఓ, తక్షణమే స్పందించారు. పంటల కోత మరియు రవాణా సమయం కాబట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరాకు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పీఓ ఇచ్చిన భరోసాతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు రంగారెడ్డి, గంగయ్య, నరసింహారావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
# Yadagiri








