మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
నిరుపేదలకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొండంత అండగా నిలిచారు.
మచ్చబొల్లారం తుర్కపల్లి ప్రాంతానికి చెందిన గుమ్మ ప్రేమ చరణ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.
వైద్య ఖర్చులు భారంగా మారిన తరుణంలో వారు ఎమ్మెల్యేను ఆశ్రయించగా, ఆయన చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ (LOC) మంజూరైంది. ఈ నేపథ్యంలో, ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులను కలిసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.1,10,000/- విలువైన ఎల్ఓసీ పత్రాలను వారికి స్వయంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప ఆసరాగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, ప్రశాంత్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొని ఎమ్మెల్యే చేస్తున్న సేవలను కొనియాడారు.
#Sidhumaroju
Alwal










