అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని రామసముద్రం చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రయోగశాలను 25 రోజులుగా శుభ్రం చేయడం లేదని ల్యాబ్ టెక్నీషియన్ టి. నాగేంద్రబాబు ఆరోపించారు. తీవ్ర దుర్వాసన కారణంగా తాను స్పృహ కోల్పోయానని, మెడికల్ ఆఫీసర్ డా. బి. నాగరాజ్ తనను అసభ్యకరంగా దూషించడంతో పాటు అటెండెన్స్ రిజిస్టర్లో తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరిపి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. ఈ సంఘటన జూన్ 20న చోటుచేసుకుంది.










