యర్రగొండపాలెం టీడీపీ ప్రజా దర్బార్‌లో ఎరిక్షన్ బాబు|

0
1

యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా యర్రగొండపాలెం మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించగా, వాటిని స్వయంగా పరిశీలించిన ఎరిక్షన్ బాబు గారు తక్షణమే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వినతులపై కూడా వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాలని అధికారులను సూచించారు. ప్రతి వినతి పత్రాన్ని ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ చేకూరి సుబ్బారావు గారు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళ రెడ్డి గారు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.