నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల ఆందోళన|

0
0

పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. నారాయణ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, బ్యాగులు విక్రయిస్తూ తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థపై చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు# కొత్తూరు మురళి.