మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. కాలువపై నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలాంటప్పుడు విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. శివాజీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే విగ్రహాన్ని అనువైన మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ మేరకు మంత్రులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.










