పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, వేసవి దృష్ట్యా గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఇంటింటి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛ పథంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని ఆదేశించారు# కొత్తూరు మురళి.










