పుంగనూరు: లారీని ఢీకొన్న ఐచర్ వాహనం

0
6

పుంగనూరు నూతన బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుల కారణంగా రోడ్డు పక్కన నిలిపిన సిమెంట్ లారీని, మదనపల్లె నుంచి పలమనేరుకు వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి.