పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తిరుపతి వైపు వెళ్లిన గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు.
రోడ్డుపై పడిన అతడిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.










