స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి పుంగనూరు మున్సిపాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోకుల్ సర్కిల్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాయల చెరువు డ్రైన్ క్యానల్ ను పరిశీలించి.
అన్న క్యాంటీన్ లో అధికారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం క్యాంటీన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు సీవీ రెడ్డి, రామకృష్ణ రాజు తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.








